ప్రముఖ మలయాళ దర్శకుడు సాచీ కన్నుమూశారు. ఆయన వయస్సు 48 సంవత్సరాలు. జూన్ 16న గుండెపోటు రావడంతో కేరళలోని త్రిస్సూర్లో జూబ్లి మిషన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తుండగా జూన్ 18, గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. దర్శకుడు సాచీ కన్నుమూతతో మలయాళ సినీపరిశ్రమలో విషాదం నెలకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు.
సాచీ పూర్తి పేరు కెఆర్ సచ్చిదానందన్. ఆయన 2015 లో ‘అనార్కలి’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఇటీవలే సాచీ దర్శకత్వంలో పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన “అయ్యప్పనుమ్ కోషియుమ్” చిత్రం సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగుతో పాటుగా హిందీ, తమిళంలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu