రవాణా వ్యవస్థలో సేవలు అందిస్తున్న పలు కంపెనీలకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఉబర్ మరియు రాపిడో వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవలు అందించే కంపెనీల అన్ని రకాల ఆటో సర్వీసులను రాబోయే మూడు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం కర్ణాటక రవాణా శాఖ నోటీసు జారీ చేసింది. అలాగే పెరుగుతున్న రైడ్ ధరలపై ఈ కంపెనీలను నివేదికను కోరింది. ఆన్-డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ యాక్ట్ 2016 ప్రకారం క్యాబ్ అగ్రిగేటర్లు నడుపుతున్న ఆటో సర్వీసులను చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నిబంధనలను పాటించకపోవడం వలన ఆటోరిక్షా సర్వీసును నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కర్ణాటక రవాణా శాఖ నోటీసులో పేర్కొంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY