తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. దీంతో ఆగస్టు 4, మంగళవారం నాడు ఒక్కరోజే 5063 కరోనా పాజిటివ్ కేసులు, 108 కరోనా మరణాలు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,68,285 కి చేరింది. మరోవైపు మంగళవారం నాటికీ రాష్ట్రంలో 28,92,395 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (ఆగస్టు 4, మంగళవారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 2,68,285
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 2,08,784
- యాక్టీవ్ కేసులు – 55,152
- ఆగస్టు 4 న నమోదైన కేసులు – 5063
- ఆగస్టు 4 న డిశ్చార్జ్ అయినవారు – 6501
- ఆగస్టు 4 న నమోదైన మరణాల సంఖ్య – 108
- మొత్తం మరణాల సంఖ్య – 4349
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu