కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 4,677 కరోనా కేసులు, 33 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,24,618 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 39,125 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 6,632 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 50,28,752 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 49,459 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 7276 యాక్టీవ్ కేసులు ఉండగా, ఎర్నాకులంలో 7163, కోజికోడ్ లో 6720, త్రిస్సుర్ లో 4780, కొట్టాయంలో 4648, కొల్లంలో 3375 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 3,95,22,149 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ