కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 558 కరోనా కేసులు, 2 మరణాలు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65,29,607 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 67,550 గా ఉంది.
ఇక కొత్తగా కరోనా నుంచి 773 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 64,56,428 కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,802 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఎర్నాకులంలో 119, కొట్టాయంలో 69, కోజికోడ్ లో 61, తిరువనంతపురంలో 57, కొల్లంలో 50 కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళలో మొత్తం 21,229 కరోనా పరీక్షలను పరీక్షించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ