ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 10,344 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అనంతపురంలో 12, తూర్పుగోదావరిలో 6, చిత్తూరులో 6 నమోదయ్యాయి. కృష్ణా, కర్నూల్, శ్రీకాకుళం విజయనగరం వంటి 4 జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,19,367 కు చేరుకుంది.
ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,730 గా ఉంది. గత 24 గంటల్లో 45 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 23,04,193 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 444 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,33,71,025 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ