కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 2,676 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 52,47,177 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 47,794 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,742 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 51,79,277 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 19,416 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఎర్నాకులంలో జిల్లాలో అత్యధికంగా 3643 యాక్టీవ్ కేసులు ఉండగా, తిరువనంతపురంలో 3150, కోజికోడ్ లో 2770, కొట్టాయంలో 2476, త్రిస్సుర్ లో 1774, మలప్పురంలో 1230, ఇడుక్కిలో 988 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి కేరళలో 4,14,97,103 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ