తెలంగాణ పోలీస్ శాఖపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 800 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా, మంగళవారం హైదరాబాద్ లోని నార్సింగి పీఎస్లో 20 మంది పోలీసులకు కరోనా రావడం కలకలం సృష్టించింది. కరోనా సోకడంతో.. పోలీస్ స్టేషన్ బయటినుంచే నార్సింగి పోలీసులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. అలాగే కమిషనరేట్లు, ఎస్పీ ఆఫీస్లకు సాధారణ వ్యక్తుల అనుమతిని నిరాకరించారు.
అత్యవసరమైతే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగించుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకే పోలీసులు ఈ ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంటి వద్దకే పోలీస్ సేవలను అందిస్తున్నారు. ఫిర్యాదుదారులను పోలీస్ స్టేషన్ లోకి కూడా అనుమతించడం లేదు. ఆన్లైన్ లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తేనే స్వీకరిస్తామని పోలీసులు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF