కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 29,682 కరోనా కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 41,81,137 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 21,422 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 25,910 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 39,09,096 కు చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 2,50,065 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 36421 యాక్టీవ్ కేసులు ఉండగా, మలప్పురంలో 33633, ఎర్నాకులంలో 33733, త్రిస్సుర్ లో 21954, తిరువనంతపురంలో 17100, అలపుజాలో 15656 కేసులు ఉన్నాయి. మరోవైపు శనివారం నాటికి కేరళలో 3,22,34,770 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ