దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 9,062 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,86,256 కు చేరుకుంది. అలాగే కరోనా వలన మరో 36 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,27,134 కి పెరిగింది. దీంతో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం లక్ష ఐదు వేలుకుపైగా (1,05,058 (0.24%)) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో కర్ణాటక (1121), ఢిల్లీ (917), మహారాష్ట్ర (836), తమిళనాడు (670), హర్యానా (636), కేరళ (604), ఉత్తరప్రదేశ్ (453), హిమాచల్ ప్రదేశ్ (446), గుజరాత్ (425), తెలంగాణ (406) వంటి రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి.
అలాగే కొత్తగా 15,220 మంది కరోనా బాధితులు కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 4,36,54,064 కు చేరుకుంది. ఇక దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.57 శాతంగానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఆగస్టు 17, బుధవారం ఉదయం 7 గంటల వరకు 208.57 కోట్లకుపైగా (2,08,57,15,251) వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందించబడ్డాయని వెల్లడించారు. ముందు రోజున 25,90,557 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY