ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత వాణీ జయరాం కన్నుమూశారు. శనివారం చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతం హాడోస్ రోడ్లోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాగా ఆమె వయస్సు 78 సంవత్సరాలు. వాణీ జయరాం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ, భోజ్పురి, తుళు మరియు ఒరియా తదితర భాషల్లో దాదాపు 8వేలకు పైగా పాటలు ఆలపించారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించిన ఆమె అసలు పేరు కలైవాణి కాగా.. వారి తల్లిదండ్రుల ఆరుగురు సంతానంలో వాణీ జయరాం ఐదవ వారు. ఇక ఇటీవలే కేంద్రం ప్రభుత్వం ఆమెకు భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ భూషణ్‘ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.
1971లో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం ఐదు దశాబ్దాలకు పైగా సాగింది. వాణీ జయరాం ఇటీవలే ప్రొఫెషనల్ సింగర్గా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తన సుదీర్ఘ సినీ కెరీర్లో 10,000 కు పైగా పాటలను పాడారు. ఈ క్రమంలో వాణీ జయరాం వివిధ చిత్ర పరిశ్రమలలోని పేరొందిన మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. ఆర్డి బర్మన్, కేవీ మహదేవన్, ఓపీ నయ్యర్, మదన్ మోహన్ మరియు ఇళయరాజా వంటి దిగ్గజ స్వరకర్తలతో కలిసి పనిచేశారు. కాగా వాణీ జయరాం ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డులను మూడుసార్లు గెలుచుకోవడం గమనార్హం. అలాగే తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ, గుజరాత్ మరియు ఒడిశా రాష్ట్రాల నుండి రాష్ట్ర అవార్డులను కూడా అందుకున్నారు. ఇక వాణీ జయరాం మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE