కర్ణాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం.. పోల్ ఇన్‌చార్జ్‌గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నియామకం

Union Minister Dharmendra Pradhan, Dharmendra Pradhan Appointed as BJP In-charge For Karnataka Assembly Polls, Mango News, Mango News Telugu, Karnataka Assembly Polls In-charge, BJP appoints Union Minister Dharmendra Pradhan, Tamil Nadu BJP President K Annamalai, upcoming Karnataka polls, upcoming Karnataka assembly elections,Dharmendra Pradhan, Karnataka Assembly Polls Updates

త్వరలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల కోసం అధికార పక్షమైన బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమైన దక్షిణాది రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను అక్కడ పోల్ ఇన్‌చార్జ్‌గా నియమించింది. ఈ మేరకు బీజేపీ శనివారం కీలక ప్రకటన చేసింది. అలాగే తమిళనాడు బిజెపి యూనిట్ అధ్యక్షుడు కె. అన్నామలై కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. కాగా పార్టీలో పోల్ ఆర్గనైజేషన్ నిర్వహించడంలో ధర్మేంద్రకు మంచి పేరుంది.

ఇక ప్రస్తుత కేంద్ర కేబినెట్‌లో విద్యాశాఖ మంత్రిగా, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌కు గతంలో పలు ఎన్నికలను నిర్వహించిన అనుభవం ఉంది. దీంతో బీజేపీ ఆయనను కర్ణాటక ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది. కాగా కర్ణాటకలో బీజేపీ ప్రధానంగా కాంగ్రెస్, జెడి(యు) పార్టీలతో గట్టి పోటీని ఎదుర్కోనుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారిగా కన్నడనాట ఎన్నికల బరిలోకి దిగనుండటం విశేషం. ఈ నేపథ్యంలో బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారం నిలబెట్టుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 4 =