కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు మే 30, శనివారం నాడు ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసి, సంబంధిత మార్గదర్శకాలను ప్రకటించింది.
లాక్డౌన్ 5.0 మార్గదర్శకాలు – ఫేజ్ 1:
జూన్ 8, 2020 నుంచి ప్రారంభమయ్యే కార్యకలాపాలు:
- మతపరమైన ప్రదేశాలు / ప్రార్థనా స్థలాల్లో (ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు మొదలైనవి…) ప్రజలకు అనుమతి
- హోటళ్ళు, రెస్టారెంట్లు మరియు ఇతర ఆతిథ్య సేవలకు అనుమతి
- షాపింగ్ మాల్స్
- ఈ కార్యకలాపాల ప్రారంభం కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాలుతో సంప్రదించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించేలా విధి విధానాలు/నియమాలను జారీ చేస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu