భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 27,524 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6059 మంది కోలుకున్నారు, 1019 మంది మృతిచెందారు. అలాగే రాష్ట్రంలో 1,000 మందికి పైగా పోలీసు సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. గత కొన్నిరోజులుగా ప్రతి రోజు 1000కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం విధించిన లాక్డౌన్ మరో రెండ్రోజుల్లో అనగా మే 17 తో ముగియనుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం మే 17 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగింపునకే మొగ్గుచూపుతునట్టు తెలుస్తుంది.
రాష్ట్రంలోని ముంబయి, పుణె, ఔరంగాబాద్, సోలాపూర్, నాసిక్ జిల్లాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండి, పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో మే 31 వరకు లాక్డౌన్ను పొడిగించాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ముంబయి నగరంలో ఇప్పటికే 16738 కేసులు నమోదవగా, రాష్ట్రంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే మే నెల చివరికల్లా 50 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu