మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 8, మంగళవారం కూడా 10,891 కరోనా కేసులు, 295 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58,52,891 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,01,172 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 16,577 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 55,80,925 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.35 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.73 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,67,927 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 3,69,07,181 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ