ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ ప్రారంభించారు. వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ప్రతి సంవత్సరం రూ.13,500 అందజేస్తారు. ఈ పథకం ద్వారా 49 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తొలివిడతలో భాగంగా ప్రతి రైతు కుటుంబానికి రూ.7,500 ఖాతాలో జమ చేసేలా నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో 2 వేలు అందించగా, ఇప్పుడు రూ.5500 ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక అక్టోబర్లో 4వేలు, వచ్చే సంక్రాంతికి మరో 2వేలు అందజేస్తామని తెలిపారు. మరోవైపు కౌలు రైతులు, అటవీ భూములు, అసైన్డ్ భూములు సాగు చేస్తున్నవారికి రూ.7500 అందజేస్తామని పేర్కొన్నారు.
గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితా ఉంచుతామని, ఎవరి పేరైనా లేకపోతే నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. రైతులకు నగదు బదిలీ కాకుంటే 1902 కాల్ సెంటర్కు ఫోన్ చేయొచ్చని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తీ కావస్తున్నా నేపథ్యంలో మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు సీఎం తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని సీఎం సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu