కరోనాపై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోతకు సంబంధిన ఆర్డినెన్స్ కు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి వేతనాల్లో కోత వర్తింపు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లోక్ సభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ఎంపీల వేతనాల కోతకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల వేతనాలు,పెన్షన్ సవరణ బిల్లు-2020కు సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు అనుగుణంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో ఏప్రిల్ నెల నుంచి ఏడాదిపాటుగా 30 శాతం కోత పడనుంది. మరోవైపు కరోనాపై పోరాటంలో భాగంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu