మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, ఆదివారం నాడు 5,508 కరోనా కేసులు, 151 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,53,328 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,33,996 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 4,895 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 61,44,388 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.71 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.1 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 71,510 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 14458 యాక్టీవ్ కేసులు ఉండగా, సంగ్లీలో 7370, సతారాలో 7309, అహ్మెద్ నగర్ లో 6601, థానేలో 6130 కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 4,95,68,519 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ