మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఆ రాష్ట్రంలో ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3, గురువారం నాడు ఒక్కరోజే అత్యధికంగా 18,105 కరోనా పాజిటివ్ కేసులు, 391 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,43,844 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 25,586 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 13988 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 6,12,484 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,05,428 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu