మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుంది. గతకొన్ని రోజులుగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 20, శనివారం నాడు కూడా 6281 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,93,913 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 51,753 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 2,567 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 19,92,530 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.16 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.47 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 48,439 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. శనివారం నాటికి మహారాష్ట్రలో 1,56,52,742 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ