ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్ని రోజులగా రికార్డ్ స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 4944 కరోనా పాజిటివ్ కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 4944 కేసులతో కలిపి జూలై 21, మంగళవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58668 కు చేరింది. గత 24 గంటల్లో 37162 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. కరోనా వలన తూర్పు గోదావరి జిల్లాలో పది మంది, విశాఖపట్నంలో తొమ్మిది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, అనంతపూర్ లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, గుంటూరులో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూల్ లో నలుగురు, కడపలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 758 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 21, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం పరీక్షలు: 13,86,274
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 58668
- కొత్తగా నమోదైన కేసులు : 4944
- నమోదైన మరణాలు : 62
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 25574
- యాక్టీవ్ కేసులు : 32336
- మొత్తం మరణాల సంఖ్య : 758
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu