ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అంతర్జాతీయ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. దోహా నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అదుపుతప్పి రన్వే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమాన రెక్కలలో ఒకటి దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉండగా ఎవరూ గాయపడలేదని, ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్టు ఎయిర్ పోర్టు డైరెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనకు గల కారణాలపై ఎయిర్ పోర్ట్ అధికారులు విచారణ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ