కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,451 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో ఆగస్టు 14, శనివారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 36,71,541 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో 105 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 18,499 కు పెరిగింది.
అదేవిధంగా కొత్తగా 19,104 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 34,72,278 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 1,80,240 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 2,93,34,981 కు చేరగా, గత 24 గంటల్లోనే 1,39,223 పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ