మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 20, మంగళవారం నాడు 6910 కరోనా కేసులు, 147 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 62,29,596 దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,30,753 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 7,510 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 60,00,911 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.33 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.09 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 94,593 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పుణేలో అత్యధికంగా 15042 యాక్టీవ్ కేసులు ఉండగా, థానేలో 12549, సంగ్లీలో 10849, ముంబయిలో 10638, కొల్హాపూర్ లో 10100 కేసులు ఉన్నాయి. మరోవైపు మంగళవారం నాటికి మహారాష్ట్రలో 4,58,46,165 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ