తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ, వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. అలాగే తనకు వ్యాక్సిన్ వేసిన డాక్టర్ శ్రీకృష్ణ, నర్సు కెరినా జ్యోతిలతో పాటుగా ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 19, సోమవారం రాత్రి 9 గంటల వరకు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందించిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,34,51,309 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇందులో 1,09,39,898 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 25,11,411 మంది లబ్ధిదారులకు రెండో డోస్ కరోనా వ్యాక్సిన్ వేసినట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ