ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 20, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,89,553 కు, మరణాల సంఖ్య 6481 కు చేరుకుంది. గత 24 గంటల్లో (9AM-9AM) 69,095 కరోనా పరీక్షలు నిర్వహించగా 3503 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వలన మరో 28 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వలన చిత్తూరులో నలుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, శ్రీకాకుళంలో ఒకరు మరియు విశాఖపట్నంలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 6481 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 7,49,676 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 5114 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 33396 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu