రెండు రోజుల క్రితం తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ కు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. భారత ప్రధాని మోదీ మరియు భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, బిపిన్ పార్థివదేహం వద్దకు చేరుకొని కన్నీటితో నివాళి అర్పించారు. బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ మృతదేహాలను ప్రజల సందర్శనార్ధం ఢిల్లీ లోని వారి స్వగృహం వద్ద ఉంచారు. హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్, తదితరులు వారి మృతదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వంటి ప్రముఖులు అంజలి ఘటించారు. కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, తదితరులు కూడా బిపిన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు నివాళులు అర్పించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ