మహారాష్ట్ర రాష్ట్రంలో మళ్ళీ కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జనవరి 9 న 44388 కరోనా కేసులు, 12 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 69,20,044 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,41,639 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 15351 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 65,72,432 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.98 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.04 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 2,02,259 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఆదివారం నాటికి మహారాష్ట్రలో 7,05,45,105 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ