మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. రోజువారీగా పెద్దసంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతుండడంతో రాష్ట్రంలో ఆందోళన నెలకుంది. దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కరోనా కేసుల్లో 60 శాతానికిపైగా మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మార్చి 17, బుధవారం నాడు ఒక్కరోజే 23179 కరోనా కేసులు, 84 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,70,507 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 53,080 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,138 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 21,63,391 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.26 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.24 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,52,760 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 1,78,35,495 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ