దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వేగం పెరిగింది. జూన్ 21 నుంచి దేశంలో కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చాక రోజువారీగా లక్షల సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 29 కోట్లు దాటింది. హెల్త్ కేర్, ఫ్రంట్లైన్ వర్కర్స్ తో పాటుగా 18 ఏళ్లు పైబడినవారందరికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 23, బుధవారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 29 కోట్లు (29,46,39,511) దాటినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటిదాకా దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగిరిలో 6,59,41,855 మంది లబ్ధిదారులు మొదటి డోసు మరియు 14,28,117 మంది రెండో డోసు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ