మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. గురువారం నాడు కూడా కొత్తగా 3580 కరోనా కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,09,951 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 49,058 కు పెరిగింది. అలాగే కొత్తగా 3,171 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 18,04,871 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో హోమ్ ఐసొలేషన్ లలో, ఆసుపత్రుల్లో 54,891 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (డిసెంబర్ 24, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 19,09,951
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 18,04,871
- యాక్టీవ్ కేసులు – 54,891
- డిసెంబర్ 24 న నమోదైన కేసులు – 3,580
- డిసెంబర్ 24 న డిశ్చార్జ్ అయినవారు – 3,171
- డిసెంబర్ 24 న నమోదైన మరణాల సంఖ్య – 89
- మొత్తం మరణాల సంఖ్య – 49,058
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ