మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా 24 గంటల వ్యవధిలో 35 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 35,952 పాజిటివ్ కేసులతో మొత్తం కేసుల సంఖ్య 26,00,833 కి చేరింది. మరో 111 మరణించడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 53,795 కు పెరిగింది. అదేవిధంగా కొత్తగా 20,444 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 22,83,037 కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,62,685 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (మార్చి 25, గురువారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 1,88,78,754
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 26,00,833
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 22,83,037
- యాక్టీవ్ కేసులు – 2,62,685
- మార్చి 25 న నమోదైన కేసులు – 35,952
- మార్చి 25 న డిశ్చార్జ్ అయినవారు – 20,444
- మార్చి 25 న నమోదైన మరణాలు – 111
- మొత్తం మరణాల సంఖ్య – 53,795
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ