మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. డిసెంబర్ 1, మంగళవారం నాడు 4930 కరోనా కేసులు, 95 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,28,826 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 47,246 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 6,290 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 16,91,412 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.49 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.58 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 89,098 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ