బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ మంగళవారం నాడు శివసేన పార్టీలో చేరారు. శివసేన పార్టీ అధ్యక్షుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళా మతోండ్కర్ శివసేనలో చేరి, పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన సినీనటి ఊర్మిళా మతోండ్కర్, ఆరు నెలల తిరగకుండానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఊర్మిళా 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. లోక్ సభ ఎన్నికలలో ముంబయి ఉత్తర నియోజక వర్గం నుంచి ప్రముఖ బీజేపీ నాయకుడు గోపాల్ శెట్టి పై పోటీ చేసి నాలుగు లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం పార్టీ వ్యవహారాలపై అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆమె శివసేన పార్టీలో చేరారు. పార్టీలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ