మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జూలై 25, సోమవారం నాడు 785 కరోనా కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,35,046 కు చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,48,068 కి పెరిగింది. ఇక కరోనా నుంచి కొత్తగా 937 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 78,72,444 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.98 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.84 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 14,534 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా పూణేలో అత్యధికంగా 4989 యాక్టీవ్ కేసులు ఉండగా, ముంబయిలో 1826, నాగపూర్ లో 1492, థానేలో 987, నాషీక్ లో 712, అహ్మద్ నగర్ లో 475, రాయగడ్ లో 353, సోలాపూర్ లో 315, ఔరంగాబాద్ లో 314 ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికి మహారాష్ట్రలో 8,29,36,088 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY