మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 25, శుక్రవారం నాడు 9844 కరోనా కేసులు, 197 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 60 లక్షలు(60,07,431) దాటగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,19,859 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 9,371 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 57,62,661 కు చేరుకుంది.
రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.93 శాతంగా ఉండగా, మరణాల రేటు 2 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 1,21,767 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ముంబయిలో అత్యధికంగా 18687 యాక్టీవ్ కేసులు ఉండగా, పుణేలో 17363, థానేలో 12999, సంగ్లీలో 9753, కొల్హాపూర్ లో 9704 కేసులు ఉన్నాయి. మరోవైపు శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 4,03,60,931 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ