ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 4981 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జూన్ 24, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,67,017 కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి 943, చిత్తూరులో 854, పశ్చిమగోదావరిలో 593, శ్రీకాకుళంలో 500 నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మరో 6,464 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన రాష్ట్రంలో మరో 38 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 12490 కి పెరిగింది. గత 24 గంటల్లో 88,622 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 2,14,49,636 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూన్ 24, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 18,67,017
- కొత్తగా నమోదైన కేసులు : 4,981
- కొత్తగా నమోదైన మరణాలు : 38
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 18,04,844
- యాక్టీవ్ కేసులు : 49,683
- మొత్తం మరణాల సంఖ్య : 12490
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ