మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో జూలై 23, గురువారం ఒక్కరోజే కొత్తగా 9895 కరోనా పాజిటివ్ కేసులు, 298 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,47,502 కి చేరింది. అలాగే ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,854 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 6484 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1,94,253 కి చేరింది. ప్రస్తుతం 1,40,093 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో జూలై 23 నాటికీ 17,41,992 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu