కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన నాలుగో విడత లాక్డౌన్ రేపటితో అనగా మే 31 వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను మరోసారి పొడిగించింది. దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్రం ఈ రోజు ప్రకటించింది. అలాగే కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో ఇప్పటివరకు నిషేదించిన పలు కార్యకలాపాలను దశలవారీగా తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu