ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని తన నివాసంలో గురువారం ఉదయం పీఎంవో స్టాఫ్ కుమార్తెలతో కలిసి రక్షా బంధన్/రాఖీ పండుగ వేడుకలను జరుపుకున్నారు. పీఎంవోలో పనిచేస్తున్న తోటమాలి, డ్రైవర్లు, స్వీపర్లు, ప్యూన్లు మొదలైన వారి కుమార్తెలతో ప్రధాని మోదీ రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “చిన్నారులతో ఇది చాలా ప్రత్యేకమైన రక్షా బంధన్” అని పేర్కొన్నారు. అలాగే రాఖీ పండుగ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
A very special Raksha Bandhan with these youngsters… pic.twitter.com/mcEbq9lmpx
— Narendra Modi (@narendramodi) August 11, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY