దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 150 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే గదిలో ఐసొలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే వారి కాంటాక్ట్ వ్యక్తులను కూడా క్వారంటైన్ లో ఉంచి పర్యవేక్షణ చేస్తునట్టు తెలిపారు. ఇతర నమూనాలపై కూడా వైరస్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) లో కొత్తరకం కరోనా వైరస్ విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు యూకేతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా 60 కి పైగా దేశాలకు కొత్తరకం కరోనా స్ట్రెయిన్ వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెఛ్ఓ) వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ