తెలంగాణ రాష్ట్రంలో మరో 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 23, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,93,253 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే కరోనా నుంచి కొత్తగా 376 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,88,275 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 98.30 శాతంగా ఉంది.
ఇక కరోనా వలన మరొకరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1589 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,389 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 32, కరీంనగర్ లో 13, మేడ్చల్-మల్కాజ్ గిరిలో 12, రంగారెడ్డి జిల్లాలో 12, మంచిర్యాలలో 9 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ