అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనాతో మరణించిన వారి 5 లక్షలు (500,310) దాటింది. అలాగే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా 2.8 కోట్లు (28,190,403) దాటింది. కరోనా నియంత్రణకు అమెరికా ప్రభుత్వం పలుచర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజువారీగా 50 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా, న్యూయార్క్, ఇల్లీనియస్, జార్జియా, ఒహియో, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, అరిజోన, న్యూ జెర్సీ వంటి రాష్ట్రాలలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
కరోనాతో మరణించిన అమెరికన్లకు అధ్యక్షుడు జో బైడెన్ నివాళులు:
మరోవైపు కరోనాతో మరణించిన అమెరికన్లకు వైట్ హౌస్ వద్ద కొవ్వొత్తులు వెలిగించి అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, “కరోనా మహమ్మారి వలన దేశం మరో భయంకరమైన మైలురాయిని దాటింది. 5,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అర్థం చేసుకోలేని సంఖ్య, కానీ ప్రతి ఒక్కరూ మరలా సంపూర్ణంగా ఉండని ఒక కుటుంబాన్ని సూచిస్తారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఏ పదాలు నొప్పిని తగ్గించలేవని తెలుసు, కాని దేశం మీతో బాధపడుతుందని తెలుసుకోవడంలో మీకు కొంత ఓదార్పు లభిస్తుందని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. అలాగే కరోనా మృతులకు సంతాపంగా ఐదు రోజులపాటుగా ఫెడరల్ ప్రభుత్వ భవనాలపై ఉన్న అన్ని అమెరికా జాతీయ జెండాలనూ అవనతం చేయాలని అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు ఇచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ