కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 361 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 2 శాతంగా నమోదైంది. దీంతో ఏప్రిల్ 6, బుధవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 65,34,713 కి చేరింది. అలాగే కొత్తగా 369 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 64,63,180 కు చేరింది.
మరోవైపు గత 24 గంటల్లో 18,040 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, ఇప్పటికి మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 4,68,15,403 కు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. అయితే పత్రాలు ఆలస్యంగా అందినందున గత 24 గంటల్లో మునుపటి రోజులకు సంబంధించిన 3 మరణాలను, కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాల ప్రకారం 29 మరణాలను ప్రకటించారు. దీంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 68,228 కి పెరిగింది. ప్రస్తుతం కేరళలో 2,467 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ