ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేస్తానంటూ ముంబయిలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కార్యాలయానికి ఓ ఆగంతకుడు బెదిరింపు ఈ-మెయిల్ పంపించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై నిఘా వర్గాలు దర్యాప్తు ప్రారంభించాయి. తన వద్ద 20 కిలోల ఆర్డిఎక్స్ ఉందని, దేశంలో వేలాది మందిని చంపేందుకు కుట్ర చేస్తునట్టు పంపిన వ్యక్తి ఈ-మెయిల్ లో పేర్కొన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా 20 దాడులకు ప్లాన్ చేస్తున్నానని, అలాగే ఈ పని చేయగల వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నానని మరియు ఈ దేశానికి పెను విషాదాన్ని సృష్టిస్తానని పేర్కొన్నాడు. ఫిబ్రవరి 28న స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసానని, ఈ ప్లాన్తో వివిధ ఉగ్రవాద సంస్థలకు కూడా సంబంధం ఉందని ఆ వ్యక్తి మెయిల్ లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ ముంబయి బ్రాంచ్ ఈ-మెయిల్ ను ఇతర ఏజెన్సీలతో కూడా పంచుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. అధికారులు ఈ ఈ-మెయిల్ ఎక్కడినుంచి వచ్చిందో గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ