తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.టి.రామారావుకు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. వచ్చే నెలలో తామ నిర్వహించబోయే అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, ప్రసంగించాల్సిందిగా అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కేటీఆర్కు ఆహ్వానం పంపింది. సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్ పేరుతో మే 1 నుంచి 4వ తేదీ వరకు లాస్ ఏంజిల్స్లోని బెవర్లీ హిల్టన్లో మిల్కెన్ ఇనిస్టిట్యూట్ 25వ వార్షిక సదస్సును నిర్వహించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ ఈవెంట్లో చర్చకు మీ సహకారాన్ని అందిస్తారని, దీనిని మా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారని మేము ఆశిస్తున్నామని మిల్కెన్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ ఎల్. క్లౌడెన్ ఆహ్వాన లేఖలో తెలిపారు.
ఇంకా ఆయన లేఖలో ఇలా తెలిపారు.. ఈ సంవత్సరం నిర్వహించ తలపెట్టిన ఈ ఇన్విటేషన్-ఓన్లీ ఈవెంట్లో దాదాపు 3,000 మంది పార్టిసిపెంట్లను వ్యక్తిగతంగా హోస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మైఖేల్ ఎల్. క్లౌడెన్ పేర్కొన్నారు. మానవ, ఆర్థిక మరియు విద్యా వనరులను అవసరమైన వారికి అనుసంధానం చేయడం ద్వారా మిల్కెన్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప ఆచరణాత్మక విధానాన్ని అమలుచేస్తోంది. కాగా ఈ సదస్సుకు ఆహ్వానం పలికినందుకు మిల్కెన్ ఇనిస్టిట్యూట్కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సదస్సులను నిర్వహించటానికి కుదరలేదని, దీని ద్వారా ప్రపంచంలోని ప్రముఖు వ్యక్తులను కలిసేందుకు ఎదురుచూస్తున్నా అని కేటీఆర్ తన ఆసక్తిని ప్రదర్శించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ