భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 4, 2021 నుంచి సెప్టెంబర్ 14, 2021 మధ్య ఇంగ్లాండ్ తో భారత్ జట్టు 5 టెస్టులు ఆడనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ లో ఉన్న 23 మంది భారత్ ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది. అయితే కరోనా సోకిన ఆటగాడి పేరును బీసీసీఐ అధికారికంగా బయటకు వెల్లడించలేదు. కరోనా పాజిటివ్ గా తేలిన ఆటగాడు క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు.
మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టు గురువారం మధ్యాహ్నం మూడు రోజుల సన్నాహక మ్యాచ్ కోసం డర్హామ్ చేరుకోనుంది. దీంతో కరోనా సోకిన ఆటగాడు మినహా మిగతా వాళ్లంతా డర్హామ్ కు బయలుదేరనున్నట్టు తెలుస్తుంది. డర్హామ్ చేరుకున్న తర్వాత కూడా ఆటగాళ్లను మళ్లీ కరోనా పరీక్షలు చేయనున్నట్టు సమాచారం. ఇటీవల ఇంగ్లాండ్ లో డెల్టా వేరియంట్ ప్రభావంతో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఈ క్రమంలో టెస్టు సిరీస్ సమయంలో ఆటగాళ్ల భద్రత, బయో బబుల్ విషయంలో బీసీసీఐ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ