పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై దాడి జరిగింది. ఈరోజు వజీరాబాద్లో జరిగిన లాంగ్ మార్చ్ ర్యాలీలో ఆయనపై దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఆయన కాలికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. దీంతో హుటాహుటిన ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. అలాగే మాజీ ప్రధాని మేనేజర్ రషీద్, మాజీ గవర్నర్ సింధ్ ఇమ్రాన్ ఇస్మాయిల్ సహా ఆరుగురు గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ కాలులోకి మూడు, నాలుగు బుల్లెట్లు దిగినట్లు పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నేత ఇమ్రాన్ ఇస్మాయిల్ తెలిపారు.
పంజాబ్ ప్రావిన్స్లోని వజీరాబాద్ నగరంలోని జాఫర్ అలీఖాన్ చౌక్ సమీపంలో ఈ దాడి జరిగింది. ర్యాలీలో భాగంగా ఆయన కంటైనర్ పైకి ఎక్కి మాట్లాడుతుండగా సమీపం నుంచి ఒక దుండగుడు ఏకే 47 రైఫిల్ తో కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా పాకిస్తానీ టెలివిజన్ ఛానెల్లలో ప్రసారమయ్యే టెలివిజన్ ఫుటేజీలో ఇమ్రాన్ ఖాన్ కాలుకు కట్టు కట్టినట్లు కనిపిస్తోంది. అలాగే గాయపడ్డ ఆయనను కొందరు కారులోకి ఎక్కించడం కూడా కనిపిస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్త్తోంది. కాగా ఇటీవలే ఇమ్రాన్ ఖాన్పై పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE