పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణ తేదీలు ఖరారయ్యాయి. 17వ లోక్సభ యొక్క 6వ సెషన్ జూలై 19 నుంచి ప్రారంభించి, ఆగస్టు 13, శుక్రవారం నాడు ముగుస్తుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే రాజ్యసభ 254వ సెషన్ జూలై 19 నుండి ఆగస్టు 13 వరకు కొనసాగుతుంది. ఈ సెషన్లో మొత్తం 19 రోజుల పాటుగా సమావేశాలను నిర్వహించనున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాల నిర్వహణ కోసం ఉభయసభల్లో అన్ని కరోనా ప్రొటొకాల్స్ అనుసరించి ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈసారి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్ సభ మరియు రాజ్యసభ రెండూ ఒకేసారి సమావేశాలను నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ