దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతుంది. జూన్ 21 నుంచి కేంద్రప్రభుత్వం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి తెచ్చాకా, దేశవ్యాప్తంగా రోజువారీగా లక్షల సంఖ్యలో లబ్ధిదారులకు వ్యాక్సిన్ డోసులు పంపిణి చేస్తున్నారు. గత 12 రోజుల్లోనే 6.3 కోట్లకుపైగా డోసుల పంపిణీ జరిగింది. ఈ నేపథ్యంలో జూలై 3, శనివారం ఉదయం 7 గంటల వరకు లబ్ధిదారులకు 34 కోట్లకుపైగా (29,46,39,511) కరోనా వ్యాక్సిన్ డోసులు అందించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లోనే 43,99,298 వ్యాక్సిన్ డోసులను అందించడం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటిదాకా దేశంలో 18-44 సంవత్సరాల వయస్సు కేటగిరిలో 9,64,91,993 మంది లబ్ధిదారులు మొదటి డోసు మరియు 23,80,048 మంది రెండో డోసు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ